Header Banner

పెట్రోల్ తలపై పోసుకుంటున్న యువకులు! మణిపూర్ లో మళ్లీ ఎందుకీ ఉద్రిక్తతలు?

  Sun Jun 08, 2025 16:55        India

మణిపూర్ లో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గతంలో కుకీ, మైటీ వర్గాల మధ్య ఘర్షణలతో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మణిపూర్ ఇటీవల కాస్త నిశ్శబ్దంగా కనిపించింది. అయితే శనివారం రాత్రి అరంబై టెంగోల్ (ఏటీ) కీలక నేత ననన్ సింగ్‌ను అరెస్ట్ చేయడంతో ఇంఫాల్ లో మళ్లీ హైటెన్షన్ మొదలైంది. ఈ అరెస్ట్ కు వ్యతిరేకంగా యువకులు, మైటీ వాలంటీర్లు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. వారు టైర్లు, పాత వస్తువులను తగులబెట్టి రోడ్లను దిగ్భంధించారు. నిరసనలో ఉన్న కొందరు యువకులు పెట్రోల్ బాటిళ్లు పట్టుకుని తలపై పోసుకుంటూ 'మమ్మల్ని మేమే చంపుకుంటాం' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

ఇది కూడా చదవండి: 4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్! దేశవ్యాప్తంగా 465కు పైగా..

 

ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్, తౌబాల్, కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు ఐదు రోజుల పాటు నిలిపివేశారు. సోషల్ మీడియాలో ద్వేషపూరిత మెసేజులు, రెచ్చగొట్టే ఫొటోలు, వీడియోలు పోస్ట్ అయ్యే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏటీ సంస్థ స్పందిస్తూ—2023 మేలో చట్ట అమలులో విఫలత వల్ల గ్రామ వాలంటీర్లు ఆయుధాలు ధరించాల్సి వచ్చిందని, అప్పటి నుంచి మైటీ గ్రామాలు కుకీ మిలిటెంట్ల దాడులకు గురయ్యాయని తెలిపింది. అదే సమయంలో పీపుల్ లిబరేషన్ ఆర్మీ (PLA), కేవైకేఎల్, కేసీపీ వంటి నిషేధిత మిలిటెంట్ గ్రూపులు మయన్మార్ నుంచి తిరిగి వచ్చాయని, సైనిక పట్టు తగ్గడం వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయని అభిప్రాయపడుతున్నారు.

 

ఇది కూడా చదవండి:  ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఆ నీచులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు.. ఒక్కొక్కరికి ఊచకోతే! మహిళలపై అనుచిత వ్యాఖ్యలు!

 

మహిళలను కించపరిస్తే సహించం - క్షమాపణలు చెప్పాలి.! లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!

 

రైతులకు శుభవార్త! తక్కువ వడ్డీతో రూ.3 లక్షల లోన్!

 

ఏపీకి వస్తోన్న గూగుల్.. అక్కడ 143 ఎకరాల్లో ఏర్పాటు.. ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?

 

ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #ManipurTension #ATLeaderArrest #HighAlertImphal #ManipurProtests #YouthProtest #InternetShutdown #ShockingScenes #PetrolThreatProtest #EthnicClashes #NorthEastNews